Rajanna Sircilla : రోడ్డెక్కిన మాజీ సర్పంచులు.. బిల్లుల కోసం రిలే నిరాహార దీక్షలు

Best Web Hosting Provider In India 2024

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 254 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో గత ఐదేళ్లలో సర్పంచులు రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులు చేశారు. కొంత ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినప్పటికీ.. మరికొంత గ్రామ సర్పంచులు కలిపి అభివృద్ధి పనులు పూర్తి చేశారు. పనులు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా.. బిల్లులు రాకపోవడంతో చాలామంది సర్పంచులు అప్పులపాలయ్యారు.

చివరకు పదవి కాలం ముగిసి మూడు మాసాలు గడిచింది. అయినా పెండింగ్ బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచులు జాయింట్ యాక్షన్ కమిటీ ( జేఏసీ) గా ఏర్పడి ఆందోళన బాట పట్టారు. అన్ని గ్రామాల నుంచి మాజీ సర్పంచులు సిరిసిల్లకు చేరుకుని.. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

గత ఐదేళ్లలో గ్రామాల్లో పల్లె ప్రగతి కింద.. ఒక్కో గ్రామంలో ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు పనులు చేశామని సర్పంచులు చెబుతున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి.. స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ పనులు చేశామని అంటున్నారు. చేసిన పనులు ఎంబి రికార్డులో నమోదు చేసినా.. బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక సార్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి పత్రాలు సమర్పించినా.. ఎవరు తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

ప్రభుత్వం ఇస్తామంటుంది, కానీ ఇవ్వడం లేదని సర్పంచులు వాపోతున్నారు. అప్పులు తీర్చలేక కొందరు మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 254 గ్రామాల మాజీ సర్పంచులకు భారీగా బిల్లులు రావాలని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

టాపిక్

KarimnagarTelangana NewsGovernment Of Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024