OTT Thriller Movie: కృతి డ్యుయల్ రోల్.. పోలీస్‍గా కాజోల్.. ఈ వారమే ఓటీటీలోకి నయా థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చు?

Best Web Hosting Provider In India 2024


ఈ వారం ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది. మంచి క్రేజ్ ఉన్న ‘దో పత్తీ’ చిత్రం నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. బాలీవుడ్ స్టార్లు కాజోల్, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే ఎంట్రీ ఇస్తోంది. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిన్నితెరకెక్కించారు దర్శకుడు శశాంక చతుర్వేది. దో పత్తీ సినిమా వివరాలు ఇక్కడ చూడండి.

దో పత్తీ చిత్రంలో కృతి సనన్ రెండు పాత్రలు పోషించారు. కవలలుగా నటించారు. సీనియర్ నటి కాజోల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. ఓ కేసు విషయంలో నిజాలు రాబట్టేందుకు కాజోల్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఇప్పటికే వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా అనిపించింది. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఓటీటీ డేట్.. తెలుగులో కూడా..

దో పత్తీ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ శుక్రవారం (అక్టోబర్ 25) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీలో రూపొందిన ఈ సినిమా తెలుగుతో పాటు ఇంగ్లిష్ డబ్బింగ్ వెర్షన్‍లలోనూ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.

స్టోరీలైన్

దో పత్తీ చిత్రంలో క్రైమ్‍తో పాటు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ట్విస్టులు, టర్న్‌లు, లవ్, పోరాటం ఈ చిత్రంలో ఉంటాయని నెట్‍ఫ్లిక్స్ టీజ్ చేస్తోంది. ఈ చిత్రంలో సౌమ్య సూద్, షాలీ అనే రెండు పాత్రలను కృతి సనన్ చేశారు. షాహిర్ షేక్ క్యారెక్టర్ చేశారు ధృవ్ సూద్. సౌమ్య, ధృవ్ లవ్‍లో ఉంటారు. షాలీ ఎంట్రీతో పరిస్థితులు మారిపోతాయి. ఆ తర్వాత జరిగే ఓ క్రైమ్ గురించి విద్య జ్యోతి (కాజోల్) ఇన్వెస్టిగేషన్‍లోకి దిగితారు. వీటి చుట్టూ దో పత్తీ స్టోరీ సాగుతుంది.

దో పత్తీ మూవీని రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు శశాంక చతుర్వేది రూపొందించారు. ఈ మూవీని కట్టా పిక్చర్స, బ్లూ బటర్‌ఫ్లై బ్యానర్లపై కనిక థిల్లాన్, కృతి సనన్ నిర్మించారు. లీడ్ రోల్ చేసిన కృతి కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగమయ్యారు. అలాగే, తాను డ్యుయల్ రోల్ చేయడం ఇదే తొలిసారి అని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని వేచిచూస్తున్నట్టు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో కృతి అన్నారు.

దో పత్తీ చిత్రానికి అనురాగ్ సైకియా, సచెత్ – పరంపర, తనిష్క్ బాగ్చి సంగీతం అందించారు. మొత్తంగా ట్రైలర్‌తో ఈ మూవీపై హైప్ బాగానే పెరిగింది. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు. 

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించనున్న తేరే ఇష్క్ మే చిత్రంలో కృతి సనన్ హీరోయిన్‍గా చేస్తారనే రూమర్లు బయటికి వచ్చాయి. ఇప్పటికే స్క్రిప్ట్ విని ఆమె ఓకే చెప్పారని టాక్ ఉంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తారు. 

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024