కూట‌మి పాల‌న‌లో మ‌హిళ‌ల మాన ప్రాణాల‌కు విలువే లేదు

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల‌

అఘాయిత్యాల‌ను అరిట‌క‌ట్ట‌డంతో కూట‌మి స‌ర్కార్ విఫ‌లం

ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు క‌నీస సామాజిక బాధ్య‌త లేదు

ఏపీలో మ‌హిళ‌లు, బాలిక‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది

వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో దిశ యాప్ తీసుకొచ్చాం

దిశ యాప్ ద్వారా ఎంద‌రో మ‌హిళ‌ల‌కు న్యాయం జ‌రిగింది

వైయ‌స్ జ‌గ‌న్‌కు మంచి పేరు వ‌స్తుంద‌ని దిశ చ‌ట్టం ప్ర‌తులు కాల్చివేశారు

తాడేప‌ల్లి:  కూట‌మి పాల‌న‌లో మ‌హిళ‌ల మాన ప్రాణాల‌కు విలువే లేదని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఏపీలో మ‌హిళ‌ల‌పై ఆకృత్యాలు పెరిగిపోతున్నా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు క‌నీస సామాజిక బాధ్య‌త లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో అఘాయిత్యాల‌ను అరిక‌ట్ట‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది ఆమె మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల మీడియాతో మాట్లాడారు.

గుంటూరులో అమ్మాయిపై ఓ రౌడీషీట‌ర్ దారుణానికి పాల్ప‌డితే ఇంత‌వ‌ర‌కు హోం మంత్రి అనిత నోరు మెద‌ప‌లేదు. ఆమెకు మీకు బాధ్య‌త లేదా?. గుంటూరు ఘ‌ట‌న‌లో రౌడీషీట‌ర్ వెనుక ఉన్న‌ది ఎవ‌రూ?  తెనాలి,గుంటూరులో టీడీపీ నాయ‌కులు ఏమ‌య్యారు. . హోం మంత్రి ఎక్క‌డ దాక్కున్నారు. అడ్డ‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం, ప్ర‌తిప‌క్షంపై ఇష్టం వ‌చ్చిన‌ట్లు నోరు పారేసుకోవ‌డానికేనా నీకు మంత్రి ప‌ద‌వి ఇచ్చింది.  ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ బ‌తుకుతున్నారు. బాలిక‌లు, మ‌హిళ‌లు స‌మిద‌లు అవుతున్నారు.
టీడీపీ నేత ఖాద‌ర్‌బాషా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా ఇంత‌వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇదేనా మీకు మ‌హిళ‌ల ప‌ట్ల ఉన్న బాధ్య‌త‌.
చంద్ర‌బాబు  ముఖ్య‌మంత్రిగా ఉన్న ఏ ద‌శ‌లోనూ మ‌హిళ‌ల‌కు న్యాయం చేయ‌లేక‌పోయారు. 1996లో అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలో అనురాధ అనే అమ్మాయికి రూ.5 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని హైకోర్టు తీర్పు ఇస్తే..చంద్ర‌బాబు సుప్రీం కోర్టుకు వెళ్లి కోట్లు ఖ‌ర్చు పెట్టారే కానీ ఆడ‌పిల్ల‌కు ప‌రిహారం ఇవ్వ‌లేదు.
2014లో నాగార్జున యూనివ‌ర్సిటీలో రిషితేశ్వ‌రి అనే అమ్మాయికి కూడా చంద్ర‌బాబు న్యాయం చేయ‌లేదు. కానీ పంచాయ‌తీలు మాత్రం చంద్ర‌బాబు బాగా చేస్తారు. ఇది కాదు బాధితుల‌కు కావాల్సింది.
త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షి విష‌యంలో కూడా చంద్ర‌బాబు పంచాయితీ చేశారే కానీ నిందితుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి స్థానంలో ఉంటూ ఏ ద‌శ‌లోనూ న్యాయం చేయ‌లేక‌పోయారు. ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేక‌పోయారు. వైయ‌స్ జ‌గ‌న్ మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం దిశ యాప్ తీసుకొచ్చి అండ‌గా నిల‌బ‌డ్డారు. కోటిన్న‌ర మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. పోలీసు స్టేష‌న్లు ఏర్పాటు చేసి ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే వైయ‌స్ జ‌గ‌న్ అండ‌గా నిలిచారు. దిశ యాప్ ద్వారా 91600 మంది అమ్మాయిల‌కు సహాయం అందింది. దిశ గొప్ప చ‌ట్టం కాబ‌ట్టే జాతీయ స్థాయిలో 18 అవార్డులు పొందింది. ఈ రోజు ఈ చ‌ట్టాన్ని రాజ‌కీయ క‌క్ష‌ల‌తో ప‌క్క‌న పెట్టారు. మ‌హిళ‌ల కోసం అంత‌గా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాప‌త్ర‌య ప‌డ్డారు. జ‌గ‌న‌న్న‌కు మంచి పేరు వ‌స్తుంద‌ని దిశ చ‌ట్టాన్నికేంద్రంతో ఆమోదించ‌లేక‌పోతున్నారు. దిశ ప‌త్రాల‌ను హోం మంత్రి అనిత‌, ముఖ్య‌మంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేష్ త‌గుల‌బెడుతున్నార‌ని త‌ప్పుప‌ట్టారు.

 

Best Web Hosting Provider In India 2024