Telangana Cabinet Decisions : రైతులకు శుభవార్త.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

Best Web Hosting Provider In India 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ శనివారం జరిగింది. ఈ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలో సెంట్రల్ వర్సిటీకి భూకేటాయింపుపైనా నిర్ణయం తీసుకుంది. ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులు చేయాలని నిర్ణయించింది.

మద్నూర్‌ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడానికి ఆమోదం తెలిపింది. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పరిధి పెంపుపైనా నిర్ణయం తీసుకుంది. ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

Whats_app_banner

టాపిక్

Ts CabinetRevanth ReddyFarmersTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024