Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: చంద్రబాబు డైరెక్షన్ మేరకే పుంగనూరు కుట్ర జరిగిందని, అల్లర్లు సృష్టించి అరాచకాలకు పాల్పడింది చంద్రబాబు, ఆయన గ్యాంగేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నాయకుడంటే అల్లర్లు ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ.. చంద్రబాబు మాత్రం రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాడని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఉన్న పోలీసులే ఇప్పుడు కూడా ఉన్నారు కదా.. పోలీసులంటే చంద్రబాబుకు ఎందుకంత చులకనభావం అని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం తగులబడాలనే పుంగనూరు నుంచి చంద్రబాబు ప్లాన్ చేశారు. కుట్ర కోణం లేకుండా ఈ ఘటనలు జరుగుతాయా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడమని, చంద్రబాబు లాంటి గుంటనక్కల ఆటలు సాగనీయం అని వార్నింగ్ ఇచ్చారు.